వార్తలు విశ్లేషణలు
27, సెప్టెంబర్ 2021, సోమవారం
భారీ వర్షంలో సంపూర్ణంగా భారత్ బంద్
26, సెప్టెంబర్ 2021, ఆదివారం
నేడే భారత్ బంద్
భారత్ బంద్కు YSR తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుంది.
25, సెప్టెంబర్ 2021, శనివారం
ఈ డబ్బులన్నీ నీ జాగీరు కాదు బిడ్డా
<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-9358413606572061" crossorigin="anonymous"></script> <ins class="adsbygoogle" style="display:block" data-ad-format="fluid" data-ad-layout-key="-ft-q-57-df+1gc" data-ad-client="ca-pub-9358413606572061" data-ad-slot="1239354153"></ins> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({}); </script>
24, సెప్టెంబర్ 2021, శుక్రవారం
మనుషుల్లో పశు వాంఛ
9, సెప్టెంబర్ 2021, గురువారం
పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు బేఖాతరు
6, సెప్టెంబర్ 2021, సోమవారం
అప్పు ఆప్ లకు ఆత్మార్పణం
ఆకట్టుకునే ఆఫర్లతో అమాయకులు బలి
4, మే 2021, మంగళవారం
Two weeks ago, Prime Minister Narendra Modi called on states to only consider lockdowns "as the last option." Now everyone from his political allies to top business leaders and US President Joe Biden's chief medical adviser see them as the only way to stem the world's worst virus outbreak.
The debate has been complicated by PM Modi's move last year to impose a nationwide lockdown without warning, spurring a humanitarian crisis as migrant workers fled on foot to rural areas. While the Prime Minister is keen to avoid that criticism again, particularly after his Bharatiya Janata Party failed to win an election in West Bengal when votes were counted Sunday, even states run by his party are ignoring his advice.
"One of the problems is this false narrative that it's either a full lockdown, which equates to economic disaster, or no lockdown, which is a public health disaster," said Catherine Blish, an infectious disease specialist and global health expert at Stanford Medicine in California. "What's happening now is a health and an economic disaster. If you have huge swaths of your population getting sick, that's not good for your population or your economy.
24, ఏప్రిల్ 2021, శనివారం
కలియుగ లక్షణాలు.. తెలుసుకుంటే నిజమే అంటారు..
మహాభాగవతంలోని 12వ స్కంధంలో కలియుగ లక్షణాలు గురించి రచించారు వేదవ్యాసులు. అవేంటో మనం కూడా తెలుసుకుందాం.
కలి ప్రభావం పెరుగుతున్నా కొద్దీ సత్యం,
ధర్మం, దయ, క్షమ, ఆయువు, జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటాయి.
ధనం ములం ఇదం జగత్ అంటారుగా. అలానే ధనవంతుడే గుణవంతుడు, ధర్మపరుడు, సర్వ నియంత అవుతాడు.
ప్రేమ వివాహాలు కుల, మతాలకు అతీతంగా జరుగుతాయి. కులం, శీలం, యోగ్యతల మాట లేకుండా పెండ్లిలు చేస్తారు. ప్రేమలో నిజాయితీ కూడా చాలా తక్కువ.
మోసం చేయడం, అబద్ధాలు ఆడటం ఉత్తమ నైపుణ్యంగా మారుతాయి.
బ్రహ్మ జ్ఞానం పొందటం వలన కాకుండా కేవలం జంధ్యం వేసుకున్నందుకు బ్రాహ్మణులుగా గుర్తించబడుతారు.
అరవగలిగేవాడు పండితులు. చెడుగా ఉండటమే మంచితనము. సహజీవనమే వివాహంగా పరిగణిస్తారు
దూరంగా ఉండే మురికిగుంట పుణ్య తీర్థంగా, వెంట్రుకలు పెంచుకోవడం అందముగా భావించడం, పొట్ట నింపుకోవడమే పురుషార్థం, కుటుంబ పోషణ ఘన కార్యంగా, కీర్తిని కోరడం ధర్మాచరణగా ప్రజలు గుర్తిస్తారు.
కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.
ఐకమత్యమే మహాబలం.
గోవధ సర్వసాధారణ విషయంగా మారుతుంది.
ఈ అంశాలను నేటి సమాజానికి పోల్చి చూడండి. మన పూర్వీకులు ఎంతటి జ్ఞానవంతులో, మనం ఎంతటి విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదను కోల్పోయామో తెలుస్తుంది
లౌకికవాద రాజకీయాలకు బలవుతున్న ముస్లింలు..!
లౌకికవాదం అనే రాజకీయ వ్యూహం భారతీయ ముస్లింలకు భవిష్యత్తులో తీరని నష్టాన్ని కలిగించనుంది. చెప్పుకోవడానికి ఎంత బాగున్నా కూడా.. చేతల్లో మాత్రం మెజారిటీలను అవమానించేలా మారుతుంది. అలా అని ముస్లింలకు ఏమైనా గౌరవం దక్కుతుందా అంటే అది లేదు.
ముస్లింల బుజ్జగింపు పేరుతో ఇస్లాం ఆచరించే ఇతర దేశాల్లో వారిని భారతీయ ముస్లింల మధ్యలో కలిపేస్తున్నారు. అందుకు ఇస్లాం ఖత్రేమే హై లాంటి నినాదాలను వాడుతున్నారు. శరణార్థుల పేరిట దేశంలోకి అక్రమంగానో, సక్రమంగానో తీసుకొచ్చి పడేస్తున్నారు.
చొరబాటుదారులకు, శరణార్థులకు లౌకిక పార్టీలు రేషన్ కార్డులు, గుర్తింపు కార్డులు కూడా ఇప్పిస్తున్నాయి. అస్సాం, బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నాయి. ఇక అక్రమంగా చొరబడిన వారు చేసే దాడులు, అరాచకాల నిందలు పూర్తిగా ముస్లిం సమాజంపైనే పడుతున్నాయి.
మైనారిటీల సంక్షేమం అని మాట్లాడే ఏ పార్టీ కూడా వారిని విద్యావంతులుగా చూడాలని కోరుకోకపోవడం శోచనీయం. ముస్లిం సమాజంలో మత చాందసవాదాన్ని ఎలా నూరిపోయాలా.. ఎలా వారిని బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలా అని మాత్రమే లౌకిక పార్టీలు ఆలోచిస్తున్నాయి. అక్రమంగా చొరబడిన ఇస్లాం ఆచరించే వారికి సంక్షేమ ఫలాలను అందిస్తూ, భారతీయ ముస్లింలను బాయ్ చారా పేరుతో లౌకిక పార్టీలు వెర్రి వాళ్లను చేస్తున్నాయి.
మరోవైపు మైనారిటీల సంతుష్టీకరణ అనే పేరిట మెజారిటీల సంస్కృతి, సంప్రదాయాలను అవమానించే వారిని ఎనకేసుకు వస్తున్నాయి లౌకిక ప్రభుత్వాలు. అంతేకాకుండా మెజారిటీ హిందువుల ఆలయాలపై జరిగే దాడులపై కనీసం స్పందించడం లేదు. అదే మైనారిటీల పండుగలకు ఆయా లౌకిక పార్టీల నాయకులు లేని మతసామరస్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
దాని వలన మెజారిటీ హిందువుల్లో ముస్లిం పట్ల ద్వేష భావం రోజురోజుకు పెరుగుతోంది. లౌకిక రాజకీయాలు భారతీయ ముస్లిం మెడ చుట్టూ ఉచ్చులాగా మారుతున్నాయి. విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన ఇస్లాం ఆచరించే వారికి రాజభోగాలు, భారతీయ ముస్లింలకు మతం పేరిట పేదరికాన్ని లౌకిక రాజకీయాలు అంటగడుతున్నాయి.
ఉదాహరణకు పాత బస్తీలోని ఎంఐఎం పార్టీ తాము ముస్లిం సమాజం కోసం పోరాడుతున్నామని చెబుతుంది. వాస్తవంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర మతస్తుల భూములను కబ్జా చేయడం, వారి ఆస్తులను బలవంతంగా లాక్కోవడం, ఆలయాల భూములను మాయం చేయడం, ఆలయాలను కనుమరుగు చేయడం లాంటివి చేస్తున్నారు.
నిజంగా పాత బస్తీలోని ముస్లిం సమాజం ఎంఐఎం లాంటి పార్టీని సమర్థిస్తుందా అంటే.. కాదనే చెప్పుకోవాలి. ఎప్పటి కథనో ఎందుకు.. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికలనే ఉదాహరణగా తీసుకుందాం. ఎంఐఎం అభ్యర్థులు వ్యవహరించిన తీరు అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానాలను కలిగించింది.
ఎంఐఎం నేతల వ్యాఖ్యలు.. వారిని వెనకేసుకొచ్చే వారి చేతలు ముస్లిం సమాజంపై మెజారిటీ ప్రజల్లో హేయమైన భావాన్ని కలిగించేలా ప్రేరేపిస్తున్నాయి. వారిని ఉగ్రవాదులుగా, ఉగ్రవాద సమర్థకులుగా చిత్రీకరిస్తున్నాయి. పాత బస్తీ ఉదాహరణ కేవలం మచ్చుకు మాత్రమే. దేశంలో విదేశి మత చాందసవాదం(వాహబి) పెరిగిన ప్రతిచోటా మెజారిటీ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు.
ఆ నిందలు భారతీయు ముస్లింలు పడుతున్నారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే.. భవిష్యత్తులో భారత దేశం షరియా చట్టాల ఉచ్చులో చిక్కుకొని ఎడారిగా మారడమో.. లేదా మెజారిటీల ఆగ్రహానికి గురైన ముస్లిం సమాజం గడ్డు కాలాన్ని ఎదుర్కోవడమో జరుగుతుంది.
ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలంతా సమానం అనే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలి. రాజ్యాంగ సూత్రాలను ఆచరించాలి. ప్రజలను కుల, మత ప్రాతిపదికన విడదీసి విదేశీ శక్తులకు సహకరించే విధమైన శైలిని మార్చుకోవాలి. భారతీయులు చైతన్యవంతులవుతున్న ఈ తరుణంలో మైనారిటీ సంతుష్టీకరణ పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు, చొరబాటుదారులకు మద్ధతునిచ్చే దుస్సాహసాన్ని లౌకిక పార్టీలు మానుకోవాలి.
లేదంటే భవిష్యత్తులో అంతర్యుధం రావడమే కాదు. బలమైన మెజారిటీల చేతిలో లౌకిక పార్టీలు మట్టి కలవడం ఖాయం. విదేశీ ఆక్రమణదారులతో పాటు భారతీయ ముస్లిం సమాజం చేటు చూడటం అనివార్యంగా మారటం తథ్యం.
అందుకే యూనిఫాం సివిల్ కోడ్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలి. విదేశీ అక్రమ చొరబాట్లను నిరోధించాలి. అక్రమంగా ఉంటూ దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను వారి స్వదేశాలకు పంపి భారతీయ ముస్లిం సమాజంపై పడుతున్న నిందలను దూరం చేయాలి. ఈ బాధ్యతను ప్రతి రాజకీయ పార్టీ తమ భుజాలపైకి ఎత్తుకోవాలి.
వార్తలు విశ్లేషణలు
వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్
-
*అప్పు చేస్తే ఆత్మహత్యే పరిష్కారమా? *అన్నదాతకు ఆర్ధిక ఇబ్బందులెందుకు? *అప్పు చేసి అందరికి ఉపాదికల్పించినందుకా? *అప్పు చేసి నష్టాన్ని భరించిన...
-
బహుజన రాజ్యాధికార యాత్ర 29 వ రోజు మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామెరచర్ల నుంచి నేరేడు చర్ల వరకు 71 కిలోమీటర్లు యాత్ర కొనసాగింది. గ్రామ గ్రామాన...
-
ఆకట్టుకునే ఆఫర్లతో అమాయకులు బలి చీట్ చేస్తున్న చిట్ ఫండ్ మాయగాళ్లు సొచ్చేదాకా సోమలింగం సొచ్చినాకా రామలింగం ఇచ్చేదొకరు వసూలు చేసేది మరొకరు క్...