మహాభాగవతంలోని 12వ స్కంధంలో కలియుగ లక్షణాలు గురించి రచించారు వేదవ్యాసులు. అవేంటో మనం కూడా తెలుసుకుందాం.
కలి ప్రభావం పెరుగుతున్నా కొద్దీ సత్యం,
ధర్మం, దయ, క్షమ, ఆయువు, జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటాయి.
ధనం ములం ఇదం జగత్ అంటారుగా. అలానే ధనవంతుడే గుణవంతుడు, ధర్మపరుడు, సర్వ నియంత అవుతాడు.
ప్రేమ వివాహాలు కుల, మతాలకు అతీతంగా జరుగుతాయి. కులం, శీలం, యోగ్యతల మాట లేకుండా పెండ్లిలు చేస్తారు. ప్రేమలో నిజాయితీ కూడా చాలా తక్కువ.
మోసం చేయడం, అబద్ధాలు ఆడటం ఉత్తమ నైపుణ్యంగా మారుతాయి.
బ్రహ్మ జ్ఞానం పొందటం వలన కాకుండా కేవలం జంధ్యం వేసుకున్నందుకు బ్రాహ్మణులుగా గుర్తించబడుతారు.
అరవగలిగేవాడు పండితులు. చెడుగా ఉండటమే మంచితనము. సహజీవనమే వివాహంగా పరిగణిస్తారు
దూరంగా ఉండే మురికిగుంట పుణ్య తీర్థంగా, వెంట్రుకలు పెంచుకోవడం అందముగా భావించడం, పొట్ట నింపుకోవడమే పురుషార్థం, కుటుంబ పోషణ ఘన కార్యంగా, కీర్తిని కోరడం ధర్మాచరణగా ప్రజలు గుర్తిస్తారు.
కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.
ఐకమత్యమే మహాబలం.
గోవధ సర్వసాధారణ విషయంగా మారుతుంది.
ఈ అంశాలను నేటి సమాజానికి పోల్చి చూడండి. మన పూర్వీకులు ఎంతటి జ్ఞానవంతులో, మనం ఎంతటి విజ్ఞానాన్ని, జ్ఞాన సంపదను కోల్పోయామో తెలుస్తుంది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి