వార్తలు విశ్లేషణలు

24, అక్టోబర్ 2021, ఆదివారం

బైంసాలో అంబేధ్కర్ విగ్రహం ధ్వంసం



బైంసాలో అంబేధ్కర్ విగ్రహం ధ్వంసం
 ఉద్రిక్తత.. 144 సెక్షన్

నిర్మల్ జిల్లా బైంసాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. దీంతో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో భైంసాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు ఏఎస్పీ కిరణ్ ఖారే. పీడీ యాక్ట్ ప్రయోగించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భైంసా పౌరులు పోలీసులకు సహకరించాలని కోరారు. రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని, వాట్సప్ గ్రూపుల్లో వీడియోలు షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు . అల్లర్ల నేపథ్యంలో బైంసాలో 144 సెక్షన్ విధించారు పోలీసులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వార్తా విశ్లేషణలు తెలంగాణ, భారత్