భవిష్యత్తులో అవి కనుమరుగైతాయా?
ఆధునిక కాలంతో పరుగులు పెడుతున్న ప్రపంచంలో పాడిపశువులు కనుమరుగైయ్యే ప్రమాదం పొంచి ఉన్నదా ? అంటే అవుననే సమాధానాలే దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేనంతాగా భారత దేశంలో పాడి సంపద ఉండేది. వ్యవసాయానికి మూలధారమే పాడి పశువులుగా చెప్పుకునేవారు. అలాంటి వ్యవస్థ నేడు దేశంలో కనుమరుగవుతోంది. ఆధునిక పరికరాలు వ్యవసాయానికి వినియోగిస్తుండటంతో రైతులు పశుపోషణ విస్మరిస్తున్న వైనం నేడు దర్శనమిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రతి ఇంటిలోనూ పాడిపశువులు దర్శనమిచ్చేవి. ప్రతి కుటుంబం పాడిపశువులతో సుఖసంతోషాలతో విరాజిల్లేది. కానీ నేడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార ధోరణి దర్శనమిస్తుంది. పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ అనే పౌష్టిక పదార్థాలు నేడు గ్రామాల్లో లభించడం లేదు.
పాలప్యాకెట్లు లాంటి ఆధునిక ఉత్పత్తులు రావడంతో వాటిపైనే ఆధారపడుతున్నారు. శుద్ధమైన పాలు మాత్రం నేడు లబించడం లేదు. కష్టపడకుండా నేరుగా అన్ని పదార్ధాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో పశుపోషణ వ్యర్థం అనే భావనలో ఉన్నారు. మరోవైపు విదేశాల్లో మాంసాహారానికి అధిక డిమాండ్ ఉండటంతో అరకొర కనబడుతున్న పశువులు సైతం కనుమరుగవుతున్నాయి. వ్యాపార లావాదేవిల పరంగానే కొంతమంది పాడిపోషణ చేపడుతున్నారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి