వార్తలు విశ్లేషణలు

24, ఏప్రిల్ 2021, శనివారం

news&views


కరోనా మహమ్మారితో కష్టాలు పడుతున్న గ్రామీణ ప్రజలకు కరెంటు బిల్లు కిరికిరి మొదలైంది.. నార్తెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులకు లెక్కలేకుండా పోయింది. యూనిట్ ప్రకారం లెక్కలు లేకుండా బిల్లు వస్తుండటంతో జనం ఆందోళనచెందున్నారు. ఇంట్లో ఒక ఫ్యాన్, లైటు, టీవీ మాత్రమే వాడుతున్నా. నెలకు 1200 బిల్లు రావడంతో ఓ వినియోగదారుడు అవాక్కయ్యాడు. విద్యుత్ వినియోగం ఎంత చేశారో రీడింగ్ లెక్కలేకుండా బిల్లు వచ్చిందని వాపోయారు. అందాద చొప్పున బిల్లులు చేయడంపై అధికారులను అడిగితే అది అంతే అని ఫిర్యాదు చేయాలన్నారని, రోజంతా ఏదో పనులు చేసుకుని బతుకీడుస్తున్న తాము ఎక్కడ ఫిర్యాదులు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమపై కరెంటు బిల్లుతో స్తోమతకు మించి భారం వేయడం సరికాదని విస్మయం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి